Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో కరోనా కలకలం... తాజాగా పది మందికి కరోనా వైరస్

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (12:22 IST)
విశాఖపట్టణంలో కరోనా వైరస్ కలకలం చెలరేగింది. తాజా పది మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. పైగా ఇప్పటివరకు, అలాగే, రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. దీంతో ఈ సీజన్‌లో ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడిన వారి సంఖ్య 38కి చేరింది. వీరిలో 25 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 
 
గత నెల నాలుగో తేదీన విశాఖలోని కంచరపాలెంకు చెందిన సోమకళ అనే మహిళ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స పొందుతుండగా, ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులకు కూడా ఈ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. వీరితో పాటు ఇతరులకు కలిపి మొత్తం పది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై జిల్లా వ్యాప్తంగా కరోనా నిర్ధారణ టెస్టుల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. 
 
మరోవైపు, చలి కాలం కావడంతో సీజనల్ వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. రద్దీ ప్రదేశాలు, మార్కెట్లు, ఆలయాలు, ప్రార్థనలకు వెళ్లే సమయాల్లో ముఖానికి మాస్క్ ధరించాలని కోరుతున్నారు. పైగా, జనవరి నెలలో ఈ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు లేకపోలేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments