విశాఖలో కరోనా కలకలం... తాజాగా పది మందికి కరోనా వైరస్

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (12:22 IST)
విశాఖపట్టణంలో కరోనా వైరస్ కలకలం చెలరేగింది. తాజా పది మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. పైగా ఇప్పటివరకు, అలాగే, రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. దీంతో ఈ సీజన్‌లో ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడిన వారి సంఖ్య 38కి చేరింది. వీరిలో 25 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 
 
గత నెల నాలుగో తేదీన విశాఖలోని కంచరపాలెంకు చెందిన సోమకళ అనే మహిళ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స పొందుతుండగా, ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులకు కూడా ఈ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. వీరితో పాటు ఇతరులకు కలిపి మొత్తం పది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై జిల్లా వ్యాప్తంగా కరోనా నిర్ధారణ టెస్టుల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. 
 
మరోవైపు, చలి కాలం కావడంతో సీజనల్ వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. రద్దీ ప్రదేశాలు, మార్కెట్లు, ఆలయాలు, ప్రార్థనలకు వెళ్లే సమయాల్లో ముఖానికి మాస్క్ ధరించాలని కోరుతున్నారు. పైగా, జనవరి నెలలో ఈ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు లేకపోలేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments