Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్ర విభజనకు హైదరాబాదే పీఠముడి: మంత్రి జైపాల్ రెడ్డి

Webdunia
సోమవారం, 10 జనవరి 2011 (15:46 IST)
రాష్ట్ర విభజనకు హైదరాబాదే ప్రధాన పీఠముడిగా ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఎస్.జైపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు నేతలు, మంత్రులు సోమవారం ఢిల్లీలో జైపాల్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హైదరాబాదే ఓ చిక్కుముడి అని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హైదారాబాద్ సమస్యగా మారిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితికి త్వరలో పరిష్కారం లభిస్తుందన్నారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర నాయకుల్లోనూ పునరాలోచన ప్రారంభమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ క్షీరసాగర మథనం చేస్తోందని, ఇది ఆలస్యమైనప్పటికీ.. చివరకు అమృతం లభిస్తుందన్నారు.

ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర అంశంపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవమేనన్నారు. క్షేత్రస్థాయి పునాదుల్లోకి తెలంగాణవాదం చొచ్చుకుపోయిందన్నారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఎక్కువ మంది, తెలంగాణ పార్లమెంటు సభ్యులు తక్కువ మంది ఉన్నారని, ఇది కూడా సమస్యకు ఓ ప్రధాన కారణంగా మారిందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

Show comments