Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తినాపురికి వెళ్లిన సీఎం

Webdunia
సోమవారం, 13 అక్టోబరు 2008 (11:07 IST)
జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి సోమవారం హస్తినాపురికి బయలుదేరి వెళ్లారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి హాజరవ్వడంతో పాటు రైతుల సమస్యలు, నేత కార్మికుల సమస్యల పరిష్కారం, వరికి మద్దతు ధర సాధించడం తదితర అంశాలు ప్రధాన ఏజెండాగా సీఎం రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

సోమవారం జరిగే జాతీయ సమగ్రతా మండలి సమావేశానికి హాజరయ్యేందుకు సీఎం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అంతర్గత భద్రత, ప్రాంతీయ అసమానతలు తొలగించడానికి తీసుకోవాల్సిన సత్వర చర్యలు, తదితర అంశాలపై ఆయన ప్రసంగిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

బడుగు వర్గాల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలను గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో పెట్రేగిపోతున్న ఉగ్రవాదుల అలజడులను అరికట్టడానికి తీసుకోవల్సిన చర్యలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలను ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రస్తావిస్తారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

మంగళవారం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో సీఎం భేటీ అవుతారు. వరికి వెయ్యి రూపాయల మద్దతు ధర, ఎరువుల కోటా పెంపు తదితర అంశాలపై సీఎం ప్రధానమంత్రితో చర్చిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదే రోజు సాయంత్రం కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖమంత్రి పాశ్వాన్‌ను కలిసి రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ, రాష్ట్రానికి ఎరువుల పంపిణీ తదితర అంశాలపై సీఎం చర్చిస్తారు. మంగళవారం రాత్రి ఢిల్లీనుంచి విమానంలో ముఖ్యమంత్రి భాగ్యనగరానికి చేరుకుంటారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

Show comments