Webdunia - Bharat's app for daily news and videos

Install App

లగడపాటి రాజగోపాల్ : సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తాం!

Webdunia
శనివారం, 10 ఆగస్టు 2013 (13:07 IST)
File
FILE
సమైక్యాంధ్ర కోసం చివరి రక్తపుబొట్టు వరకు పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పునరుద్ఘాటించారు. విజయవాడలో శనివారం జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోని ప్రతి తెలుగువాడి గుండె చప్పుడు సమైక్యతనే కోరుకుంటోందన్నారు.

తన ఓటు సమైక్యాంధ్రకే అని చెప్పారు. ప్రతినేతా సమక్యవాదానికి కట్టుబడి ఉంటేనే రాష్ట్రం ముక్కలవకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా ప్రకటన చేశారని లగడపాటి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ప్రజల మనోభావాలను తెలుసుకోకుండా రాష్ట్రాన్ని విభజించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సమైక్యవాదానికి కట్టుబడేలా చేస్తామన్నారు.

కాగా 11వ రోజు కూడా జిల్లావ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలు, రాస్తారోకోలు కొనసాగుతున్నాయి. విజయవాడలో ఎల్పీజీ డీలర్లు పాదయాత్ర చేయగా, వస్త్రవ్యాపారులు పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి సబ్ కలెక్టరేట్ కార్యాలయం వరకూ ప్రదర్శన నిర్వహించారు. టాక్సీ యాజమానులు ప్రదర్శన చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments