Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజశేఖరుడు ఉదార స్వభావి: ముఖ్యమంత్రి రోశయ్య

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2009 (19:11 IST)
File
FILE
ముఖ్యమంత్రి దివంగత వైఎస్.రాజశేఖర రెడ్డి ఉదారస్వభావి అని రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.రోశయ్య అభిప్రాయపడ్డారు. పేదలు రెండు పూటలా కడుపునిండా అన్నం తినేందుకు గాను ఎన్నికల్లో హామీ ఇవ్వక పోయినా కిలో బియ్యం రెండు రూపాయల పథకాన్ని అమలు చేసిన మహానేత వైఎస్ అని రోశయ్య శ్లాఘించారు.

శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సంతాప సభలో రోశయ్య పాల్గొని మాట్లాడారు. ఉదయం నిద్రలేచిన మొదలుకుని రాత్రి పడుకునే వరకు ప్రజాసేవ గురించే వైఎస్ మాట్లాడేవారని గుర్తు చేశారు. దేశంలోని ఇన్ని ప్రాజెక్టులు నిర్మించాలన్న ఆలోచనా బహుశా ఏ ఒక్క నేతకు వచ్చి ఉండదన్నారు. అలాంటిది వైఎస్ చేపట్టిన జలయజ్ఞం ద్వారా ఆ కల మన రాష్ట్రంలో సాకారం కానుందన్నారు.

సముద్రం పాలవుతున్న వృధా నీటిని కాలువలు ద్వారా మళ్లించి వేలాది ఎకరాల్లో బంగారు పంటలు పండించాలని కలలగన్నారన్నారు. అంతేకాకుండా, ప్రజల సంక్షేమం కోసం ఖర్చుకు వెనుకాడే మనస్తత్వం వైఎస్‌ది కాదన్నారు.

గతంలో ఓసారి మిత్రుడికి ఎన్నికల్లో సాయం చేసేందుకు తన స్థిరాస్థులను తెగనమ్మారని రోశయ్య గుర్తు చేశారు. ఇలాంటి మహానేత ఆశయాలను, లక్ష్యాల సాధన కోసం కృషి చేయడమే వైఎస్సార్‌కు ఘనమైన నివాళి అని రోశయ్య పిలుపునిచ్చారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments