హైదరాబాద్లోని మహాత్మాగాంధీ బస్స్టేషన్లో బుధవారం ఓ సూట్కేసులో ఉంచిన శవం బయటపడడం కలకలం సృష్టించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శవం గురించి మిగిలిన వివరాల కోసం దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనకు సంబంధించి సంబంధీకుల వివరాల ప్రకారం ఈ నెల 11న ఓ వ్యక్తి సూట్కేస్తో వచ్చి దానిని బస్టాండులోని సామాన్లు భద్రపరిచే గదిలో ఉంచి వెళ్లాడు. అటుపై రెండు రోజులకు సదరు సూట్కేసు నుంచి దుర్వాసన రావడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సూట్కేసును తెరచి చూడగా అందులో శవం కనిపించింది. శవంతో పాటు దొరికిన ఆధారాల ప్రకారం మృతుడి పేరు సాయిప్రసాద్గా గుర్తించారు. మృతునికి సంబంధించిన ఇతర వివరాల కోసం పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు.