Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోసం చేయాలనే ఆలోచన లేదు: వైఎస్

Webdunia
FileFILE
ఎస్సీ వర్గీకరణ అంశంలో మాదిగలను మోసం చేయాలనే ఆలోచన తమకు ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో చొరవ తీసుకుంటే మరో వర్గం తమకు దూరమవుతుందని తెలిసినా తాము మాత్రం వర్గీకరణ వైపే మొగ్గు చూపామన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

ఎమ్మార్పీఎస్ కార్యకర్త సురేందర్ మాదిగ మృతి చెందిన నేపథ్యంలో ఓ ప్రైవేటు టీవీ ఛానెల్‌తో ముఖ్యమంత్రి మాట్లాడిన విషయాలను ఆయన కార్యాలయం ప్రెస్‌కు విడుదల చేసింది. దీని ప్రకారం వైఎస్ మాట్లాడుతూ గాంధీభవన్‌లో జరిగిన ఘర్షణ సందర్భంగా సురేందర్ మాదిగ మృతి చెందాడే తప్ప అతనిది ఆత్మాహుతి కాదని అన్నారు.

హింస ద్వారా ఏమీ సాధించలేమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆందోళనలు హింసాత్మకంగా మారితే ఉద్యమాలకు, ఉద్యమకారులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానస్థాయిలో అందనప్పుడు దాన్ని సరిచేయాల్సిన బాధ్యత సమాజంపై ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన పేర్కొన్నారు. అందుకే వర్గీకరణకు సంబంధించి మూడేళ్ల క్రితం ఓ కమిటీ వేశామని ఆయన తెలిపారు. అయితే పార్లమెంటులో సరైన బలం లేనికారణంగా, రాజ్యాంగ పరమైన సమస్యలు ఉండడంతో వర్గీకరణ సమస్య పరిష్కారం ఆలస్యమవుతోందని ఆయన పేర్కొన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments