మనీ లాండరింగ్ కేసు : వైఎస్.జగన్‌కు ఈడీ నోటీసులు జారీ

Webdunia
గురువారం, 10 నవంబరు 2011 (18:10 IST)
మనీ లాండరింగ్, ఫెమా చట్టాల కింద కేసుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ నోటీసులు గురువారం జారీ చేసింది. ఈనెల 28వ తేదీ లోపు తమ అధీకృత ప్రతినిధి ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. జగన్‌కు చెందిన సాక్షిని నడుపుతున్న జగతి పబ్లికేషన్స్‌లోకి అక్రమంగా నిధులు వచ్చినట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెల్సిందే.

జగన్ తన తండ్రి హయాంలో ప్రభుత్వం తరపున పలు కంపెనీలకు ఆయాచితంగా భూముల వంటివి కట్టబెట్టి వారి నుంచి విదేశాల ద్వారా తన కంపెనీల్లోకి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నిధుల ప్రవాహంపై వివరణ ఇచ్చే నిమిత్తం జగన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.

కాగా ఇటీవల కర్ణాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం గనుల కేసులో సీబీఐ ముందు హాజరైన విషయం తెల్సిందే. ఇప్పుడు జగతిలోకి వచ్చిన పెట్టుబడులపై ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. మనీలాండరింగ్ కేసులో దోషిగా తేలితే శిక్షతో పాటు రెండు రెట్లు జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నట్లు ఈడీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

Show comments