Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనీ లాండరింగ్ కేసు : వైఎస్.జగన్‌కు ఈడీ నోటీసులు జారీ

Webdunia
గురువారం, 10 నవంబరు 2011 (18:10 IST)
మనీ లాండరింగ్, ఫెమా చట్టాల కింద కేసుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ నోటీసులు గురువారం జారీ చేసింది. ఈనెల 28వ తేదీ లోపు తమ అధీకృత ప్రతినిధి ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. జగన్‌కు చెందిన సాక్షిని నడుపుతున్న జగతి పబ్లికేషన్స్‌లోకి అక్రమంగా నిధులు వచ్చినట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెల్సిందే.

జగన్ తన తండ్రి హయాంలో ప్రభుత్వం తరపున పలు కంపెనీలకు ఆయాచితంగా భూముల వంటివి కట్టబెట్టి వారి నుంచి విదేశాల ద్వారా తన కంపెనీల్లోకి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నిధుల ప్రవాహంపై వివరణ ఇచ్చే నిమిత్తం జగన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.

కాగా ఇటీవల కర్ణాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం గనుల కేసులో సీబీఐ ముందు హాజరైన విషయం తెల్సిందే. ఇప్పుడు జగతిలోకి వచ్చిన పెట్టుబడులపై ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. మనీలాండరింగ్ కేసులో దోషిగా తేలితే శిక్షతో పాటు రెండు రెట్లు జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నట్లు ఈడీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments