Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం నియంత్రణపై మహిళలే పోరాడాలి: చంద్రబాబు

Webdunia
రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న మద్యం అమ్మకాలపై మహిళలు ముందుకు వచ్చి పోరాటం చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పర్యటన శుక్రవారం కాకినాడలో సాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారిపోయిందన్నారు.

ముఖ్యమంత్రిగా రోశయ్య కొనసాగుతున్నప్పటికీ ఆయనను ఏ ఒక్క మంత్రి వినడం లేదన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడాలంటే ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. ఇందుకోసం ప్రజలే ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రధానంగా రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యంపై మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు ఉధృతం చేయాలన్నారు. మద్యం సిండికేట్ల రేట్లు పెంచిన ప్రభుత్వం ప్రజాధనాన్ని దోచుకుంటుందని విమర్శించారు. ప్రజల ఆరోగ్యాన్ని ఈ మద్యం సిండికేట్లు గుల్ల చేస్తున్నాయని ఆరోపించారు. ఇకపోతే.. పలువురి మృతికి కారణమవుతున్న సూక్ష్మ రుణ సంస్థలను నిషేధం విధించాలని చంద్రబాబు కోరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

Show comments