Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్దూరువాగు ప్రమాదంలో 20 మంది మృత్యువాత

Webdunia
మంగళవారం, 12 ఆగస్టు 2008 (19:10 IST)
గుంటూరు జిల్లాలోని అమరావతి సమీపాన మద్దూరు వాగు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 20కి చేరుకుంది. మద్దూరు వాగులో గల్లంతయిన వారిలో 13 మంది మృతదేహాలు లభించగా, మంగళవారం మరో ఏడు మృత దేహాలు లభించాయి. వరదల్లో మృత్యువాత పడిన వారికి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూ. రెండు లక్షలను ఏక్స్‌గ్రేషియాను ప్రకటించిన విషయం తెలిసిందే.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావానికి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో, పలు ప్రాంతాలు జలమయమైన సంగతి విదితమే. భారీ వర్షాలకు విస్తారంగా వరదనీరు వచ్చి చేరడంతో చెరువులు, వాగులన్నీ కూడా పొంగిపొర్లుతున్నాయి. ఇందులో భాగంగా మద్దూరు వాగు కూడా విస్తృతంగా ప్రవహిస్తుండటంతో లారీ అదుపుతప్పి కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.

ఈ ఇసుక లారీలో ప్రయాణిస్తున్న వారిలో 12 మంది సురక్షితంగా బయటపడగా, మరో 20 మంది మృత్యువాత పడ్డారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టర్ వెంకటేశం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఇసుక లారీలో ప్రయాణించిన ప్రయాణీకుల సంఖ్య ఖచ్చితంగా తెలియనందున ఇంకా గాలింపు చర్యలను చేపడుతున్నట్లు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

Show comments