Webdunia - Bharat's app for daily news and videos

Install App

భైంసాలో కొనసాగుతున్న కర్ఫ్యూ

Webdunia
ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణం పోలీసుల నిఘా నీడలో ఉంది. పోలీసు శాఖ విధించిన కర్ఫ్యూ సోమవారం కూడా కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో ఎపుడు ఏం జరుగుతుందో జరుగుతుందోనన్న భయంతో ప్రాంత నివాస ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దాంతో చాలామంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు.

ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో తలెత్తిన అల్లర్లు సద్దుమణగలేదు. భైంసా, కరీంనగర్‌ పట్టణాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలతో పాతనగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాలు నివసించే సున్నిత ప్రాంతాల్లో ప్రభుత్వం ముందస్తు చర్యగా పోలీసుల పహారాను ఏర్పాటు చేసింది. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

కాగా, భైంసా సమీపంలోని వటోలీలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. ఆ కోవలోనే సోమవారం కూడా బాసరలో ఓ ఆటోను గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేశారు. దీనితో అదిలాబాద్ నిర్మల్‌లో 144 సెక్షన్‌ను విధిస్తూ పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. భైంసా సమీప ప్రాంతాల్లో వరంగల్ ఎస్పీ అనిల్ కుమార్, ఐజీ పూర్ణచంద్రరావు పెంట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత కూ సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

Show comments