Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు జిమ్మిక్కులను నమ్మబోరు : పురంధరేశ్వరి

Webdunia
అవినీతి అంశాన్ని ఎజెండాగా చేసుకుని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న జిమ్మిక్కులను ప్రజలెవరూ నమ్మబోరని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయమంత్రి శ్రీమతి పురంధరేశ్వరి విమర్శించారు.

వంద కోట్ల రూపాయల ఖర్చుతో తన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను సోమవారం పురంధరేశ్వరి ప్రజలకు అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా కారంచేడులోని ఆమె స్వగృహంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉందన్నారు.

ఈ ఐదు సంవత్సరాల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయని పురంధరేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు అవినీతి అంటూ పదే పదే చేస్తోన్న రాద్ధాంతాలను ప్రజలెవరూ పట్టించుకోవటం లేదని ఆమె చెప్పారు.

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సంబంధించిన ఫైలు లా కమీషన్, హ్యూమన్ రిసోర్స్ మంత్రిత్వ శాఖల వద్ద ఉందని... చివరి సమావేశాల సమయంలో ఆ ఫైలు రానందువల్లనే పార్లమెంటులో ప్రవేశపెట్టలేక పోయామని పురంధరేశ్వరి వివరించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనతో పలుమార్లు చర్చించినట్లు ఆమె వెల్లడించారు. కాగా, రాబోయే ఎన్నికల్లో అధిష్టానం సూచన మేరకే పోటీ చేస్తానని పురంధరేశ్వరి స్పష్టం చేశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments