Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ పరం చేస్తే లగడపాటి తాటతీస్తాం : వల్లభనేని వంశీ

Webdunia
శుక్రవారం, 2 మార్చి 2012 (17:55 IST)
File
FILE
కృష్ణా జిల్లాలోని భవానీ ద్వీపాన్ని ప్రైవేట్ పరం చేస్తే విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తాట తీస్తామని తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వంశీ హెచ్చరించారు. దీనిపై ఆయన శుక్రవారం మాట్లాడుతూ... లగడపాటి స్థానిక సమస్యలు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. భవానీ ద్వీపం టెండర్లు వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

భవానీ ద్వీపం కాంట్రాక్టులో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. భవానీ ద్వీపంలో స్టార్ హోటళ్లు నిర్మిస్తే నదీ జలాలు కలుషితం అవుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవానీ ద్వీపాన్ని ప్రైవేటీకరిస్తే లగడపాటి తాట తీస్తామని, తాము ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.

ఇప్పటివరకు విజయవాడ పట్టణానికి అధికార పార్టీ సభ్యుడిగా ఉండి ఒక్క రైలును తీసుకు రాలేక పోయారన్నారు. లగడపాటి రాజగోపాల్‌కు దమ్ముంటే విజయవాడ పట్టణ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని వల్లభనేని వంశీ సవాల్ విసిరారు. బహిరంగ చర్చకు ఆయన సిద్ధం కాని పక్షంలో తాను చేసిన అభివృద్ధిని పుస్తక రూపంలో ప్రచురించాలని ఆయన హితవు పలికారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

Show comments