Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రారంభమైన పివి ఎక్స్‌ప్రెస్ వే

Webdunia
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పి.వి.నరసింహారావు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేను సోమవారం సాయంత్రం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్య ప్రారంభించారు.

పి.వి.నరసింహారావు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేను సోమవారం సాయంత్రం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్య మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రివద్ద ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రత్యేకమైన బస్సులో ఈ ఫ్లై ఓవర్‌పై ప్రయాణించారు.

ఆసియాలోనే అతి పెద్దదైన ఈ ఫ్లైఓవర్ పొడవు 11.633 కిలోమీటర్లు, ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని రూ.600 కోట్ల ఖర్చుతో నిర్మించినట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్ నగరం నుంచి శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళేందుకు వీలుగా ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించారు. ఈ ఫ్లైఓవర్‌పైకి ఇటు సరోజినిదేవి కంటి ఆసుపత్రి, అటు ఆరామ్‌ఘర్ చౌరస్తా నుంచి ఎక్కే వాహనాలు ఎడమవైపునుంచి మాత్రమే ప్రవేశించాల్సి ఉంటుందని పోలీసు అధికారులు సూచించారు.

ఇదిలావుండగా దీనిపై ప్రయాణించే వాహనాల వేగం కేవలం ప్రతి గంటకు అరవై కిలోమీటర్లకు మించకూడదు. కాగా ద్విచక్ర, త్రిచక్ర(ఆటోలు), వాహనాలతోపాటు నాలుగు చక్రాల సెవన్ సీటర్ ఆటోలు తదితర నెమ్మదిగా ప్రయాణించే వాహనాలకు ఈ ఎక్స్‌ప్రెస్ వే పైకి ప్రవేశం నిషిద్ధమని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

బ్రిటీష్ కాలం నాటి కథతో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్నచిత్రం

కమల్ హాసన్ థగ్ లైఫ్ వేడుకకు సమయంకాదని వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

Show comments