ప్రారంభమైన పివి ఎక్స్‌ప్రెస్ వే

Webdunia
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పి.వి.నరసింహారావు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేను సోమవారం సాయంత్రం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్య ప్రారంభించారు.

పి.వి.నరసింహారావు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేను సోమవారం సాయంత్రం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్య మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రివద్ద ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రత్యేకమైన బస్సులో ఈ ఫ్లై ఓవర్‌పై ప్రయాణించారు.

ఆసియాలోనే అతి పెద్దదైన ఈ ఫ్లైఓవర్ పొడవు 11.633 కిలోమీటర్లు, ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని రూ.600 కోట్ల ఖర్చుతో నిర్మించినట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్ నగరం నుంచి శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళేందుకు వీలుగా ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించారు. ఈ ఫ్లైఓవర్‌పైకి ఇటు సరోజినిదేవి కంటి ఆసుపత్రి, అటు ఆరామ్‌ఘర్ చౌరస్తా నుంచి ఎక్కే వాహనాలు ఎడమవైపునుంచి మాత్రమే ప్రవేశించాల్సి ఉంటుందని పోలీసు అధికారులు సూచించారు.

ఇదిలావుండగా దీనిపై ప్రయాణించే వాహనాల వేగం కేవలం ప్రతి గంటకు అరవై కిలోమీటర్లకు మించకూడదు. కాగా ద్విచక్ర, త్రిచక్ర(ఆటోలు), వాహనాలతోపాటు నాలుగు చక్రాల సెవన్ సీటర్ ఆటోలు తదితర నెమ్మదిగా ప్రయాణించే వాహనాలకు ఈ ఎక్స్‌ప్రెస్ వే పైకి ప్రవేశం నిషిద్ధమని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

Show comments