Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వానికి అందరూ సహకరించాలి : రఘువీరా

Sridhar Cholleti
బుధవారం, 9 జులై 2008 (13:01 IST)
WD
రైతుల కోసమే పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ సహకరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉదయం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిర్మించిన రైతు కుటుంబ విగ్రహాలను మంత్రి ప్రారంభించి, అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.

రైతులకు, ప్రభుత్వానికి మధ్య బ్రోకర్లుండరని, ప్రభుత్వం రైతుల హృదయాలలో ఉన్న సమస్యలను వెనువెంటనే పరిష్కరించే దిశగా పనిచేస్తోందని అన్నారు. ఆత్మస్థైర్యం కోల్పోకుండా రైతులుండాలని ఆయన కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కేక్ కట్‌ చేశారు. అనంతరం మంత్రి రైతు సమాచార కేంద్రాన్ని ప్రారంభించారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రమేష్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. జనార్థన్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ లకావత్ ధన్వంతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుకుటుంబం విగ్రహాలను తయారు చేసిన శిల్పి సోమయ్యకు వ్యవసాయ శాఖ మంత్రి పట్టుశాలువా కప్పి, జ్ఞాపికనిచ్చి సన్మానించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Show comments