Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజారాజ్యం సభ్యత్వ కార్యక్రమం ప్రారంభం

Webdunia
సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ సభ్య నమోదు కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభమైంది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ప్రకటించినట్టుగా పార్టీ తొలి సభ్యత్వాన్ని వికలాంగుడైన బాలకృష్ణ నాయుడుకు అందజేశారు. రెండో సభ్యుడిగా చిరంజీవి స్వీకరించారు. ఈ సభ్యత్వ కార్యక్రమం సాయంత్రం వరకు సాగుతుంది. మాజీ ఐఏఎస్ అధికారి చంద్రశేఖర్ చేతుల మీదుగా చిరంజీవి పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు.

మూడో సభ్యురాలిగా తెలుగుదేశం మాజీ నేత భూమా శోభానాగిరెడ్డి స్వీకరించగా, ఆ తర్వాత హీరో పవన్ కళ్యాణ్ ఇతర పీఆర్పీ నేతలు ఒక్కొక్కరుగా సభ్యత్వం స్వీకరించారు. ఈ సభ్యత్వానికి ముందుగా.. మెగాస్టార్ చిరంజీవి జెండాను పార్టీ కార్యాలయంలో ఎగురవేశారు. అనంతరం గాంధీ జయంతిని పురస్కరించుకుని జాతిపిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

చిరంజీవి పతాకావిష్కరణతో ఊరూరా ప్రజారాజ్యం జెండా పండుగ ప్రారంభమైంది. ఆ తర్వాత తనపేరు మీద ఏర్పాటు చేసిన మెగాస్టార్ మెయిల్ డాట్ కామ్ వెబ్‌సైట్‌ను పీఆర్పీ అధ్యక్షుడు ప్రారంభించారు. పిమ్మట మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నుంచి ఆదర్శగ్రామం గంగదేవిపల్లికి వెళతారు. ఆ గ్రామ ప్రజలతో ముఖాముఖి సమావేశమవుతారు. వారి అనుభవాలను తెలుసుకుంటారు. గ్రామస్వరాజ్యం కోసం కలలు కంటున్న చిరంజీవి.. అది సాధన దిశగా అడుగులు వేస్తున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments