ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో కొత్తగా ప్రవేశపెట్టిన నోటా బటన్ను ఆంగ్లంలో ఉంచితే గ్రామీణుల్లో ఎంతమందికి అర్థమవుతుందని, దీనికి ఓ ఎన్నికల గుర్తును ఎందుకు కేటాయించలేదని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది.
ఎవరికైనా ఓటు వేయాలంటే సదరు అభ్యర్థికో, పార్టీకో ఓ గుర్తు వుంటుంది. ఆ గుర్తుకు ఓటర్లు ఓటు వేస్తూ ఉంటారు. అయితే, ఈ దఫా మాత్రం ఇప్పుడు పోటీలో వున్నవాళ్ళెవరికీ నేను ఓటు వేయడం లేదు అనే ఆప్షన్ను ఈవీఎంలలో పొందుపరిచారు. ఆ బటన్ నొక్కితే సదరు ఓటరు ఓటు ఎవరికీ పడదు. కానీ ఓటు హక్కును వినియోగించుకున్నట్టే.
దీన్ని ఇంగ్లీషులో నోటాగా పేర్కొన్నారు. అయితే, ఆదివారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో బ్యాలెట్ పేపర్లో నోటా ఆప్షన్ కూడా ఉంచారు. అయితే గ్రామీణులకు ఈ ఆప్షన్ అర్థం కాలేదు. అందుకే హైకోర్టు జోక్యం చేసుకుంది.
త్వరలో జరుగబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలలో నోటా ఆప్షన్ మీటకి ఒక గుర్తును కేటాయించాలని, దానివల్ల నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రజలు ఆ ఆప్షన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుందని హైకోర్టు ఎన్నికల కమిషన్కి సూచించింది. నోటా ఓటుకి ఎన్నికల కమిషన్ ఏ గుర్తును కేటాయిస్తుందో చూడాలి.