తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకుని పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో అవినీతి పెచ్చరిల్లిపోతుంటే కొత్త పరిశ్రమల ఏర్పాటు ఎలా సాధ్యమవుతుందని నారా లోకేష్ అన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన నేడు గుడిపల్లె మండలం శెట్టి పల్లిలో 'పల్లె పల్లెకు తెలుగుదేశం' ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.
పార్టీ కార్యకర్తలతో భేటీ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాకపోవడంతో యువతలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్నారు.