Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున ఆక్రమణలో తుమ్మిడి చెరువు : 'జనంకోసం' ఫిర్యాదు

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2013 (19:52 IST)
File
FILE
సినీ నటుడు నాగార్జున మాదాపూర్ సమీపంలోని తుమ్మిడి చెరువును ఆక్రమించారంటూ "జనంకోసం" అనే స్వచ్ఛంధ సంస్థ లోకాయుక్తలో ఫిర్యాదు చేసింది. నాగార్జున ఆక్రమించిన చెరువులో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని ఆ సంస్థ ప్రతినిధులు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇప్పటికే అక్కినేని నాగార్జునపై టీడీపీ నేత రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ను వాణిజ్య కార్యకలాపాల కోసం వాడుకుంటున్నారనీ, దీనిపై న్యాయ పోరాటం చేయనున్నట్టు రేవంత్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో.. జనంకోసం అనే స్వచ్ఛంధ సంస్థ లోకాయుక్తలో బుధవారం ఉదయం ఒక ఫిర్యాదు చేసింది. హైదరాబాదులోని మాదాపూర్‌కు సమీపంలో ఉన్న తుమ్మిడి చెరువును ఆక్రమించి, 'ఎన్ కన్వెన్షన్ సెంటర్'‌ను నిర్మించారని స్వచ్ఛంధ సంస్థ ఫిర్యాదులో పేర్కొంది. దీనిని స్వీకరించిన లోకాయుక్త.. ఫిర్యాదులో పేర్కొన్న అంశంపై విచారణ జరిపి సమగ్ర నివేదిక అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు సమాచారం.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments