రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా రాజ్యసభ చైర్మన్కు పంపించారు. అనంతరం ఆయన నగరంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తండ్రి నందమూరి తారకరామారావుకు ఘనంగా నివాళులర్పించారు.
ఆయన మాట్లాడుతూ...రాష్ట్ర విభజన సమంజసం కాదన్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. తెలుగు వారిని విభజించే హక్కు సోనియాకు ఎక్కడదంటూ ఆగ్రహంగా ప్రశ్నించారు. నీరు, రాజధాని అంశాలు తేలిత తర్వాతే విభజనపై నిర్ణయం తీసుకోవాన్నారు.