Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాడి వీరభద్రరావు నమ్మకం : జగన్‌ ఓ శక్తి

Webdunia
ఆదివారం, 5 మే 2013 (11:10 IST)
File
FILE
జగన్ మోహన్ రెడ్డిపై దాడి వీరభద్ర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓ మనిషి కాదని ఓ శక్తి అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొనివుందని... ఇలాంటి పరిస్థితుల్లో పేద ప్రజల కష్టాలను తీర్చటంలో వైఎస్సార్ కాంగ్రెస్‌ అధినేత జగన్‌పై గురుతర బాధ్యత ఉందన్నారు.

వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే శక్తి, రాష్ట్రానికి దశ-దిశ నిర్దేశించగలిగిన సత్తా జగన్‌కు మాత్రమే ఉందని దాడి పేర్కొన్నారు.

మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన తాను తెలుగుదేశం పార్టీలో ఇమడలేక బయటకొచ్చానని.. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు.

గతంలో తాను జగన్‌పైనా, వైఎస్ఆర్ సీపీపై చేసిన ఆరోపణలన్నీ టీడీపీ అధికార ప్రతినిధిగా పార్టీ ఇచ్చిన నివేదిక మేరకు చేసినవేనన్నారు. వ్యక్తిగతంగా ఒక్క ఆరోపణ కూడా చేయలేదన్నారు. టీడీపీ ఆదేశాల మేరకు, వారిచ్చిన స్క్రిప్ట్ ఆధారంగానే మాట్లాడానని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

Show comments