Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ప్రజారాజ్యం ఖాళీ: విజయశాంతి జోస్యం

Webdunia
ఆదివారం, 10 జనవరి 2010 (16:47 IST)
తెలంగాణ ప్రాంతంలో ప్రజారాజ్యం దుకాణం ఖాళీ అయిందని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ విజయశాంతి జోస్యం చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించిన చిరంజీవి, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశారన్నారు. అందువల్ల ఇకపై తెలంగాణ ప్రాంతంలో ప్రరాపా దుకాణం కట్టేసినట్టేనని ఆమె అభిప్రాయపడ్డారు.

ఆదివారం విజయశాంతి ఆధ్వర్యంలో పలువురు ప్రరాపా నేతలు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాజిక తెలంగాణ నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసిన చిరంజీవి సమైక్యాంధ్ర అని తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆమె ధ్వజమెత్తారు.

కేంద్రం చర్చలు, కమిటీల పేర సమయం వృధా చేయకుండా తక్షణమే తెలంగాణపై పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని విజయశాంతి డిమాండ్‌ చేశారు. తమ అధినేత కేసీఆర్‌కు కేంద్రమంత్రి పదవి ఇస్తారన్న వార్తలు అవాస్తవమని విజయశాంతి అన్నారు.

హైదరాబాద్‌లోని చిత్రపరిశ్రమను విజయవాడ లేదా విశాఖపట్నంకు తరలించుకోవచ్చన్నారు. ఇందులో తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన వారిలో సింహ భాగం సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నవారేనని విజయశాంతి జోస్యం చెప్పారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments