ఒకవేళ తెలంగాణ బిల్లును వెనక్కి పంపాలని టీడీపీ అధినేత చంద్రబాబు చెబితే అది తప్పని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. చంద్రబాబు సీమాంధ్ర ప్రజల సమస్యలపై పోరాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇవ్వకపోతే పుట్టగతులుండవని హెచ్చరించారు.
సీమాంధ్ర టీడీపీ నేతల చర్యలతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసమే మాపై విమర్శలు గుప్పిస్తోందని విమర్శించారు.
ఈ నెల 8న టీటీడీపీ ఆధ్వర్యంలో మరోసారి బీజేపీ నేతలను కలసి తెలంగాణ ఏర్పాటుకు సహకరించాల్సిందిగా కోరతామన్నారు.