Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ : సుప్రీం కోర్టు ఆదేశాలను సీబీఐ ఉల్లంఘించింది!

Webdunia
FILE
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు ఆదేశాలను సీబీఐ ఉల్లంఘించిందని మెమోలో తెలిపారు. అక్రమాస్తుల కేసులో భాగంగా జైలులో ఉన్న జగన్ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు.

సీబీఐ ఐదో ఛార్జిషీట్‌పై ఆయన ఈ మెమో దాఖలు చేయడం గమనార్హం. సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా సీబీఐ ఐదో ఛార్జీషీట్‌ దాఖలు చేసిందని జగన్ మెమోలో వెల్లడించారు.

ఏడు అంశాలపై దర్యాప్తుచేసి తుది ఛార్జీషీట్ దాఖలు చేస్తామని సీబీఐ తెలిపిందని, కానీ ఇప్పుడు ఒకే అంశంపై ఛార్జీషీట్ దాఖలు చేసిందని జగన్ మెమోలో వివరించారు. దీన్నే తుది ఛార్జిషీట్‌గా పరిగణనలోకి తీసుకోవాలని జగన్ మెమో ద్వారా కోరారు. మరోవైపు విజయసాయి రెడ్డి కూడా మెమో దాఖలు చేశారు. కాగా జగన్‌ను సీబీఐ గురువారం కూడా ప్రశ్నించే అవకాశం ఉంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments