Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ వ్యాఖ్యలపై స్పందించబోను: గవర్నర్ కె. రోశయ్య

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2011 (12:36 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ చీఫ్ వై.ఎస్. జగన్ లాంటి యువకులు మాట్లాడిన మాటల మీద తాను స్పందించబోనని తమిళనాడు గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. యువకులు చేసే ఆరోపణలను నిందలు భరించే శక్తి తనకు ఉందని రోశయ్య చెప్పారు.

కాంగ్రెస్‌కు విశ్వాసపాత్రుడిగా ఉన్నందువల్లే అమీర్‌పేట కేటాయింపు కేసులో ఏసీబీ కోర్టు ద్వారా క్లీన్‌చిట్ ఇప్పించి, రోశయ్యను గవర్నర్ చేశారని జగన్ చేసిన ఆరోపణలపై ప్రత్యారోపణలు చేసేందుకు తాను సిద్ధంగా లేనని రోశయ్య స్పష్టం చేశారు. గవర్నర్‌గా ఇప్పుడు రాజకీయాలు మాట్లాడేందుకు సిద్ధంగా లేను. అది నా విధి కూడా కాదని రోశయ్య చెప్పారు.

తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఢిల్లీకొచ్చిన రోశయ్య రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌, ఉపరాష్ట్రపతి హమీద్‌అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ, హోంమంత్రి చిదంబరంలను మర్యాదపూర్వకంగా కలిశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments