జగన్ వెంట వంగవీటి రాధ: వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి చేరిక!?

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2011 (12:35 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాజీ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ చీఫ్ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రైతు మద్దతుగా విజయవాడలో చేపట్టిన మహాధర్నాలో వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. జగన్ వెంటనే ఉంటున్న వంగవీటిని జగన్ ఆప్యాయంగా హత్తుకున్నారు. దీనిని బట్టి వంగవీటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలిసింది.

కాంగ్రెసు పార్టీకి చెందిన వంగవీటి రాధా చిరంజీవి పార్టీని స్థాపించినప్పుడు ప్రజారాజ్యంలోకి వెళ్లారు. చిరంజీవి తన పార్టీని విలీనం చేసినప్పుడు మిగతా ప్రజారాజ్యం పార్టీ నాయకులతో పాటు ఆయన కాంగ్రెసులో చేరలేదు. ఈ నేపథ్యంలో విజయవాడలో రైతు ధర్నా తలెపెట్టిన వైయస్ జగన్‌తో శనివారం భేటీ అవుతారని సమాచారం. ఈ భేటీ సందర్భంగా వంగవీటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే అంశంపై చర్చిస్తారని ప్రచారం జరుగుతోంది.

ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయాలని నిర్ణయం తీసుకోవడానికి చాలా ముందు రోజుల నుంచే రాధాకృష్ణ చిరంజీవికి దూరంగా ఉంటున్నారు. చిరంజీవి ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు. విజయవాడ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇటు కాంగ్రెసులోనూ అటు తెలుగుదేశంలోనూ ఇమిడే పరిస్థితి లేకపోవడంతో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

Show comments