Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ - మోపిదేవి భాయ్.. భాయ్ : ధర్మానతో దూరం.. దూరం!!

Webdunia
బుధవారం, 5 డిశెంబరు 2012 (14:52 IST)
File
FILE
చంచల్‌గూడ జైలుకు చెందిన వీవీఐపీ ఖైదీలంతా బుధవారం గగన్ విహార్ కోర్టులో కలుసుకున్నారు. వీరంతా జగన్ అక్రమాస్తుల కేసుతో పాటు.. ఓబుళాపురం అక్రమ మైనింగ్, వాన్‌పిక్ భూముల కేటాయింపుల్లో చోటు చేసుకున్న అవకతవకల కేసుల్లో అరెస్టు అయి చంచల్‌గూడా జైలులో ఉన్నారు. వీరి రిమాండ్ గడువు బుధవారంతో ముగిసింది. దీంతో వీరిని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా, ఈ కేసులను విచారిస్తున్న న్యాయమూర్తి ధర్మారావు సెలవుపై ఉండటంతో గగన్ విహార్ కోర్టులో హాజరుపరిచారు.

ఇందుకోసం ప్రత్యేక వాహనాల్లో జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ, నిమ్మగడ్డ ప్రసాద్, రాజగోపాల్ తదితరులను ప్రత్యేక వాహనాల్లో గట్టి భద్రత నడుమ తరలించారు. వీరందరినీ కోర్టు హాలులో ఉంచారు. అపుడు జగన్ కంటే ముందే కోర్టుకు చేరుకున్న మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణను, ఇతరులను నవ్వుతూ పలకరించారు. మోపిదేవితో కరచాలనం కూడా చేశారు. అయితే మంత్రి ధర్మాన ప్రసాద రావుతో మాత్రం ఎడమొహం పెడమొహంగా కనిపించారు.

అయితే గతంలో వచ్చినప్పుడు ధర్మానతో మాట్లాడటం గమనార్హం. ప్రభుత్వ అధికారి శ్యామ్యూల్‌తో రహస్యంగా మాట్లాడటం గమనార్హం. పిమ్మట భార్య భారతీ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో, ఆడిటర్ విజయ సాయి రెడ్డితో కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత జైలు అధికారులు జగన్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. మిగిలిన నిందితులను కేసు విచారణ పూర్తి కాగానే జైలుకు తరలించారు.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments