వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులపై త్వరలో చర్యలుంటాయని రాష్ట్ర మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి జోస్యం చెప్పారు. వై.ఎస్. జగన్ కోసం జైలులో బిర్యానీ రెడీ అవుతుందని గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వై.ఎస్. జగన్ కాంగ్రెసుతో రాజీ పడే ప్రసక్తి లేదని రవీంద్రా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీలోకి వస్తామన్నా జగన్మోహన్ రెడ్డిని రానిచ్చేది లేదని డీఎల్ రవీంద్రారెడ్డి చెప్పారు. వైయస్ జగన్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కుమ్మక్కయి నాటకాలాడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణపై తమ పార్టీ అధిష్టానం రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటుందని రవీంద్రారెడ్డి వెల్లడించారు.