Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ను ఏకాకిని చేసేందుకు టీడీపీ-కాంగ్రెస్ కుమ్మక్కు : వైకాపా

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2012 (18:51 IST)
File
FILE
రాష్ట్ర రాజకీయాల్లో కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డిని ఏకాకిని చేసేందుకు అధికార విపక్ష పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఏకమయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఆమె సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీ వెనుక ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు. ప్రధానితో చంద్రబాబుకు రహస్యంగా చర్చలు జరపడం మొదటి నుంచి అలవాటేనని ఆరోపించారు.

జగన్‌ను ఎదిరించాలంటే కాంగ్రెస్ - టీడీపీలు కలిసి పనిచేయాలన్న నిర్ణయానికి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో వచ్చారన్న విషయం తేలిపోయిందన్నారు. మీడియాను అడ్డంపెట్టుకుని కుళ్లురాజకీయాలు చేసేది టీడీపీ నేతలేనని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు.. కాంగ్రెస్‌తో కుమ్మక్కవుతున్నారని ఆరోపించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments