Webdunia - Bharat's app for daily news and videos

Install App

"గాలి" బురద వేశారు... కడుక్కోలేక ఛస్తున్నా.. మంత్రి ఏరాసు

Webdunia
శనివారం, 2 జూన్ 2012 (13:32 IST)
FILE
గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ కుంభకోణంలో తన పేరును ప్రస్తావించి తనపై టన్నుల కొద్దీ బురద చల్లేశారని మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బురదను కడుక్కోలేక ఛస్తున్నానంటూ వ్యాఖ్యానించారు.

తన తండ్రి నుంచి తన వరకూ ఎప్పట్నుంచో రాజకీయాల్లో ఉన్నామనీ, ఏనాడూ అవినీతి, దౌర్జన్య కార్యకలాపాలకు పాల్పడినట్లు తమపై చిన్న వార్త కూడా లేదని అన్నారు. అటువంటిది గాలి బెయిల్ వ్యవహారంలో తన పేరును ఇరికించి మీడియాలో గోలగోల చేస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

గాలి బెయిల్ కుంభకోణంలో తన పాత్ర లేదని తేలితే ఇప్పటి వరకూ చల్లిన బురద వల్ల పాడైన తన పేరు ప్రఖ్యాతులను ఎవరు తిరిగి తెస్తారంటూ, ఈ నష్టానికి బాధ్యత ఎవరు వహిస్తారంటూ ప్రశ్నించారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఏదో గాలి వార్తలను ప్రసారం చేయడం, బురద పూయటం మామూలైపోయిందని అన్నారు. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

Show comments