Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ దొంగలు... 15 వేల కోట్లు దోచుకున్నారు : చంద్రబాబు

Webdunia
గురువారం, 8 మార్చి 2012 (11:31 IST)
File
FILE
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దొంగలు ఏకంగా 15 వేల కోట్ల రూపాయలను మద్యం సిండికేట్ల రూపంలో దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సిగ్గు శరం లేకుండా 31 బెల్టు షాపులు ఉన్నట్టు ప్రకటించుకున్నారని బాబు ఎద్దేవా చేశారు.

నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో భాగంగా ఆయన గురువారం రెండో విడత ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపైనా, కాంగ్రెస్ నేతలపైనా దుమ్మెత్తి పోశారు. కాంగ్రెస్ నేతలను దొంగలుగా పోల్చారు.

మద్యం సిండికేట్ల పేరుతో ప్రజల సొమ్ము 15 వేల కోట్ల రూపాయలను తమ జేబుల్లోకి నొక్కేసుకున్నారు. అలాగే, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానురాంగా అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని చంద్రబాబు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments