Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్‌ అధిష్టానంపై కోపం లేదు: పురంధేశ్వరి

Webdunia
కాంగ్రెస్ అధిష్టానం తనకు విశాఖపట్నం లోక్‌సభ కేటాయించడం పట్ల ఎలాంటి అసంతృప్తి లేదని కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. సీట్ల కేటాయింపులు జరిపేటప్పుడు ఒక్కోసారి కోరుకున్న స్థానాలు లభించకపోవడం అన్నది సహజమేనని ఆమె అన్నారు.

విశాఖకు చేరుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ అధిష్టానాన్ని తొలుత తాను బాపట్ల సీటు కేటాయించాల్సిందిగా కోరినమాట నిజమేనని అన్నారు. అంతమాత్రాన ఇప్పుడు కేటాయించిన విశాఖ సీటుపై తాను విముఖత చూపడం లేదని ఆమె పేర్కొన్నారు. అలాగే తాను విశాఖ సీటుపై విముఖత చూపుతున్నట్టు వస్తున్న వార్తల్లోనూ ఏమాత్రం వాస్తవం లేదని ఆమె పేర్కొన్నారు.

విశాఖ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న తాను భవిష్యత్‌లో ఇక్కడి స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. విశాఖ లోక్‌సభ స్థానానికి ఆమె సోమవారం నామినేషన్ సమర్పించనున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments