Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏజెన్సీ ప్రాంతాల్లో "ప్రజా" వైద్య శిబిరాలు: చిరు

Webdunia
మన్యం ప్రాంతాల్లో మంచాన పడిన చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న గిరిజన ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రజారాజ్యం పార్టీ నడుంబిగించింది. ప్రాణాంతక వ్యాధులతో అల్లాడుతున్న వారికి కొంతమేరకైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా ఈ ప్రాంతాల్లో ప్రజా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ భావించింది.

విశాఖ మన్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్టు పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి ప్రకటించారు. ఏజెన్సీలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రాష్ట్రానికి జబ్బు చేసిందన్న భావన కలుగుతోందన్నారు. మన్యంలోని గిరిపుత్రులు ఆంత్రాక్స్, విషజ్వరాల బారిన పడి మరణిస్తుంటే కాంగ్రెస్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

మన్యం ప్రజల ఆరోగ్య పరిస్థితిని చక్కదిద్దడం కన్నా వైఎస్ సర్కార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఏ నిర్ణయమైనా తీసుకుంటుందని చిరంజీవి ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments