Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంత దౌర్భాగ్యం.. తప్పులు తడకగా సీఎం తెలుగు ప్రసంగ పఠనం!!

Webdunia
గురువారం, 1 నవంబరు 2012 (13:05 IST)
File
FILE
ఎంత దౌర్భాగ్యం.. సాక్షాత్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి తెలుగును చదవడం కూడా రాదా? అవుననే సమాధానం ఆయనే స్వయంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు గురువారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగాయి. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఎగురవేరవేసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు.. రాష్ట్ర ప్రగతిపై ప్రసంగించారు. ఇందుకోసం ఆయన ముందుగానే తెలుగులో ఒక ప్రసంగాన్ని తయారు చేసుకున్నారు.

ఈ ప్రసంగాన్ని బుల్లెట్ ప్రూఫ్ పోడియం నుంచి ప్రసంగించారు. ఆ సమయంలో రాష్ట్ర 'పురోగమనం', 'పురోగతి' వంటి పదాలతో పాటు అనేక కఠిన పదాలు వచ్చినపుడు వాటిని ఉచ్ఛరించలేక అచ్చు తప్పులు పలికారు. అక్షరాలా తెలుగులో రాసుకున్న ప్రసంగ పాఠాన్ని కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చదవలేకపోవడం గమనార్హం. ఇలాంటి పాలకులు యువతను దేశ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతారా? అని జనం అనుకోవడం కనిపించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments