Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప ఎన్నికల ప్రచారాన్ని ఆదివారంతో ఆపేయాలి: భన్వర్‌లాల్

Webdunia
ఆదివారం, 10 జూన్ 2012 (15:36 IST)
FILE
ఉప ఎన్నికల సంగ్రామంలో భాగంగా ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారానికి తెరపడనుంది. నెల్లూరు లోక్‌సభ, 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగనున్న ఉప ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం సాయంత్రం ఐదు గంటల తర్వాత నిషేధించినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. నిషేధాన్ని అతిక్రమించి ఎవరైనా ఇంటింటి ప్రచారం చేస్తే కేసు నమోదుతో పాటు అరెస్టు కూడా చేస్తామని హెచ్చరించారు.

కాగా ఆదివారంతో ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడనుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతలు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తెలుగుదేశం పార్టీ వైకాపా, కాంగ్రెస్ పార్టీలను లక్ష్యంగా అవినీతిని ప్రచారాస్త్రంగా చేసుకుంటే..., కాంగ్రెస్ తెదేపా, వైకాపాలపై దుమ్మెత్తి పోస్తూ ప్రచారాన్ని కొనసాగించింది.

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ జైలులో ఉన్నప్పటికీ, ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలలు ఉప ఎన్నికల నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. వైఎస్సార్ మృతితో పాటు జగన్ అరెస్టుకు కాంగ్రెస్ కుట్రే కారణమని, తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు అవినీతి పరుడని విమర్శిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. ఏది ఏమైనా ఉపఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరుగుతోంది. ఇందులో ఏ పార్టీని ఓటర్లు ఆదరిస్తారనే ఫలితాలను బట్టి తెలుసుకోవాల్సిందే..!

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments