ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. కడప, పులివెందుల స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎంపీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించే మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి.. జగన్కు ఎదురుపడ్డారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా కడప జిల్లాలోని ఓ గ్రామం పరిసరాల్లో మంత్రి, కాంగ్రెసు కడప పార్లమెంటు అభ్యర్థి డిఎల్ రవీంద్రారెడ్డి, మరో మంత్రి రఘువీరారెడ్డి కాన్వాయ్ కాసేపు ఆగిపోయింది.
అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండలం తాటిగొట్ల గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో మంత్రులు డిఎల్ రవీంద్రారెడ్డి, రఘువీరారెడ్డి కాన్వాయ్ వై.ఎస్. జగన్కు ఎదురుపడింది.
అయితే జగన్ అక్కడ ప్రచారం నిర్వహిస్తుండటంతో వీరి కాన్వాయ్ కాసేపు అక్కడే ఉండి పోవాల్సి వచ్చింది. జగన్ ప్రచారం పూర్తయిన తర్వాత డీఎల్ కాన్వాయ్ అక్కడ నుంచి ప్రచారానికి బయలుదేరింది.