ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందితే కాంగ్రెస్ పార్టీకి రాంరాం చెబుతానని మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు. కేవలం తానే కాదని, పార్టీ నుంచి చాలామంది నేతలు బయటకు వచ్చేస్తారని హైదరాబాద్లో టీజీ మాట్లాడుతూ అన్నారు. ఇదే కోవలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని వీడుతారని తాను భావిస్తున్నట్లు టీజీ తెలిపారు.
రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టేనని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందిన రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చీకటి రోజని ఆయన అభిప్రాయపడ్డారు.