Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ కష్ణ కమిటీ ఓ దౌర్భాగ్య కమిటీ: పొన్నం ప్రభాకర్

Webdunia
FILE
ప్రత్యేక తెలంగాణపై నివేదిక సమర్పించిన శ్రీ కృష్ణ కమిటీ ఓ దౌర్భాగ్య కమిటీ అని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణకు సంబంధించి ఎంపీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని పొన్నం శనివారం వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆకాంక్షలను గౌరవించాలని కోర్ కమిటీకి వివరించామని పొన్నం చెప్పారు.

తెలంగాణకు భిన్నంగా నిర్ణయముంటే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకుంటామన్నారు. అధిష్టానం నిర్ణయం నచ్చని వాళ్లు పార్టీని వీడాలని, సొంత నిర్ణయాలు పార్టీపై రొద్దొదని పొన్నం తెలిపారు. తెలంగాణపై చిత్తశుద్దితో పనిచేస్తున్నామని ఆయన చెప్పారు.

ఇదిలా ఉంటే హస్తినలో కాంగ్రెస్ కోర్ కమిటీ అత్యవసర సమావేశం ఏర్పాటు కానుంది. ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కోర్ కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో తెలంగాణపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

కానీ తెలంగాణ అజెండాతోనే కోర్ కమిటీ సమావేశం జరుగుతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతుంటే, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్ ఢిల్లీలో లేనందున తెలంగాణపై చర్చ ఊహాగానాలేనని వార్తలు వస్తున్నాయి. ఇంకా నిన్న మీటింగ్‌కు కొనసాగింపే శనివారం నాటి కోర్ కమిటీ సమావేశమని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments