Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ వెంట వంగవీటి రాధ: వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి చేరిక!?

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2011 (12:35 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాజీ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ చీఫ్ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రైతు మద్దతుగా విజయవాడలో చేపట్టిన మహాధర్నాలో వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. జగన్ వెంటనే ఉంటున్న వంగవీటిని జగన్ ఆప్యాయంగా హత్తుకున్నారు. దీనిని బట్టి వంగవీటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలిసింది.

కాంగ్రెసు పార్టీకి చెందిన వంగవీటి రాధా చిరంజీవి పార్టీని స్థాపించినప్పుడు ప్రజారాజ్యంలోకి వెళ్లారు. చిరంజీవి తన పార్టీని విలీనం చేసినప్పుడు మిగతా ప్రజారాజ్యం పార్టీ నాయకులతో పాటు ఆయన కాంగ్రెసులో చేరలేదు. ఈ నేపథ్యంలో విజయవాడలో రైతు ధర్నా తలెపెట్టిన వైయస్ జగన్‌తో శనివారం భేటీ అవుతారని సమాచారం. ఈ భేటీ సందర్భంగా వంగవీటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే అంశంపై చర్చిస్తారని ప్రచారం జరుగుతోంది.

ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయాలని నిర్ణయం తీసుకోవడానికి చాలా ముందు రోజుల నుంచే రాధాకృష్ణ చిరంజీవికి దూరంగా ఉంటున్నారు. చిరంజీవి ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు. విజయవాడ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇటు కాంగ్రెసులోనూ అటు తెలుగుదేశంలోనూ ఇమిడే పరిస్థితి లేకపోవడంతో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments