Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ సౌత్ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్!!

ఠాగూర్
ఆదివారం, 31 మార్చి 2024 (14:45 IST)
రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్టణం సౌత్ నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థిని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారు. ఈ స్థానం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ - జనసేన - భారతీయ జనతా పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ మూడు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు జనసేన పార్టీ 21 అసెంబ్లీ, కాకినాడ, మచిలీపట్నం పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేస్తుంది. 
 
ఈ క్రమంలో ఇప్పటికే 18 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన పవన్ కళ్యాణ్ తాజాగా మరో స్థానానికి అభ్యర్థిని ఖరారు చేశారు. దీంతో జనసేన ఇప్పటివరకు 19 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టయింది. ఇంకా రెండు స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ రెండింటిపై కూడా రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments