Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ సౌత్ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్!!

ఠాగూర్
ఆదివారం, 31 మార్చి 2024 (14:45 IST)
రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్టణం సౌత్ నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థిని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారు. ఈ స్థానం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ - జనసేన - భారతీయ జనతా పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ మూడు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు జనసేన పార్టీ 21 అసెంబ్లీ, కాకినాడ, మచిలీపట్నం పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేస్తుంది. 
 
ఈ క్రమంలో ఇప్పటికే 18 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన పవన్ కళ్యాణ్ తాజాగా మరో స్థానానికి అభ్యర్థిని ఖరారు చేశారు. దీంతో జనసేన ఇప్పటివరకు 19 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టయింది. ఇంకా రెండు స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ రెండింటిపై కూడా రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

7వ తరగతి పాఠ్యపుస్తకంలో తమన్నా.. విద్యార్థులకు ఇది అవసరమా?

కల్కి 2898 AD చిత్రం సామాన్య ప్రేక్షకులను అలరిస్తుందా? రివ్యూ రిపోర్ట్

ప్రభాస్ "కల్కి" అవతారం విరామం వరకు ఎలా ఉందంటే...

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments