విశాఖ సౌత్ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్!!

ఠాగూర్
ఆదివారం, 31 మార్చి 2024 (14:45 IST)
రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్టణం సౌత్ నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థిని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారు. ఈ స్థానం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ - జనసేన - భారతీయ జనతా పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ మూడు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు జనసేన పార్టీ 21 అసెంబ్లీ, కాకినాడ, మచిలీపట్నం పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేస్తుంది. 
 
ఈ క్రమంలో ఇప్పటికే 18 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన పవన్ కళ్యాణ్ తాజాగా మరో స్థానానికి అభ్యర్థిని ఖరారు చేశారు. దీంతో జనసేన ఇప్పటివరకు 19 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టయింది. ఇంకా రెండు స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ రెండింటిపై కూడా రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi Vs Jani Master: జానీ మాస్టర్, ప్లేబ్యాక్ సింగర్ కార్తీక్‌‌లపై విమర్శలు.. కర్మ వదిలిపెట్టదు..

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments