Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోపాలపురంలో చంద్రబాబు: చేతుల్లో కర్పూరం వెలిగించుకుని హారతి ఇచ్చిన అభిమాని(Video)

ఐవీఆర్
శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (11:12 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏపీని అభివృద్ధిలో అట్టడుగు స్థానంలోకి నెట్టిన వైసిపి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించివేయాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఓ అభిమాని తన చేతుల్లో కర్పూరం వేసుకుని చంద్రబాబు నాయుడికి హారతి ఇచ్చారు.
 
అంతకుముందు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... ఏ నెలకి ఆ నెల అప్పు తెచ్చుకుంటేనే కానీ జీతాలు ఇవ్వలేడు, పింఛన్లు ఇవ్వలేడు ఈ అప్పుల జగ్గడు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంపద సృష్టిస్తాం. ఆ సంపదను ప్రజలకు పంచుతాం. అది మాతోనే సాధ్యం. రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తే నెలకు రూ.4000 పింఛన్‌ని ఇంటి దగ్గరకే తెచ్చి ఇచ్చే ఏర్పాటు చేస్తాం. అంతేకాదు... జగన్ ప్రభుత్వం పింఛన్లు ఇవ్వకుండా ఎవరినైనా ఇబ్బంది పెడితే, వారికి ఇప్పటి నుంచే రూ.4000 చొప్పున పింఛన్ ఇస్తాం.
 
ప్రజలకు, రాష్ట్రానికి ఏదైనా మంచి చేస్తే అది చెప్పుకుని ఓట్లు అడగాలి. దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు మంచి చేయడం అన్నది జగన్ రెడ్డి చరిత్రలో లేదు. అందుకే ఎన్నికలు అనగానే శవ రాజకీయం మొదలుపెడతాడు ఈ దుర్మార్గుడు." అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments