Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. కారణం ఏంటో తెలుసా?

సెల్వి
శనివారం, 11 మే 2024 (23:23 IST)
Alllu Arjun
ఐకాన్ స్టార్, పుష్ప హీరో అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. అనుమతి లేకుండా జనసమీకరణ చేశారని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించారని రిటర్నింగ్ ఆఫీసర్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు చేయగా క్రైమ్ నెంబర్ 71/2024గా కేసు రిజిస్టర్ చేశారు. 
 
కాగా, తన స్నేహితుడు అయిన శిల్పారవికి మద్దతుగా ప్రచారం చేసేందుకు అల్లు అర్జున్ ఇవాళ నంద్యాలలో పర్యటించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మొదట శిల్పా రవి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
 
శిల్పారవి తనకు మంచి మిత్రుడని, తనకు పార్టీలతో సంబంధం లేదన్న బన్నీ.. కేవలం శిల్పా రవితో ఉన్న వ్యక్తిగత స్నేహంతోనే నంద్యాలకు రావడం జరిగిందని వివరించారు. శిల్పా రవి వద్దన్నా తానే తనను అభినందించడానికి, విషెస్ చెప్పడానికి నంద్యాల వచ్చానని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments