Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ జగన్ మరోమారు ఏపీ ముఖ్యమంత్రి అవుతారు : హీరో విశాల్ జోస్యం

వరుణ్
బుధవారం, 17 ఏప్రియల్ 2024 (08:54 IST)
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ముఖ్యమంత్రి కావడం తథ్యమని హీరో విశాల్ జోస్యం చెప్పారు. ఆయన కొత్త చిత్రం రత్నం. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ నగరంలో ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మరోమారు సీఎం కావడం తథ్యమన్నారు. వైకాపాకు తాను బలమైన మద్దతుదారుడిని కాదనీ కానీ జగన్ వీరాభిమానిని అని చెప్పారు. 
 
రాజకీయ నాయకులు నటులుగా మారుతున్నారని, అందుకే నటులు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సినిమాలు, రాజకీయాలు బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమన్నారు. ఎక్కడో ఏపీ గదిలో కూర్చొని రాజకీయాలు చేయలేమని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి రావాలంటే కొన్ని విషయాలు పూర్తిగా మరిచిపోవాలన్నారు. ఇకపోతే, జగన్‌పై గులకరాయి దాడి ఘటనపై స్పందిస్తూ, రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని, మనం జాగ్రత్తగా ఉండాలని, ఇకపై ఆయన మరింత జాగ్రత్తగా ఉంటారని భావిస్తున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments