Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ జగన్ మరోమారు ఏపీ ముఖ్యమంత్రి అవుతారు : హీరో విశాల్ జోస్యం

వరుణ్
బుధవారం, 17 ఏప్రియల్ 2024 (08:54 IST)
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ముఖ్యమంత్రి కావడం తథ్యమని హీరో విశాల్ జోస్యం చెప్పారు. ఆయన కొత్త చిత్రం రత్నం. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ నగరంలో ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మరోమారు సీఎం కావడం తథ్యమన్నారు. వైకాపాకు తాను బలమైన మద్దతుదారుడిని కాదనీ కానీ జగన్ వీరాభిమానిని అని చెప్పారు. 
 
రాజకీయ నాయకులు నటులుగా మారుతున్నారని, అందుకే నటులు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సినిమాలు, రాజకీయాలు బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమన్నారు. ఎక్కడో ఏపీ గదిలో కూర్చొని రాజకీయాలు చేయలేమని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి రావాలంటే కొన్ని విషయాలు పూర్తిగా మరిచిపోవాలన్నారు. ఇకపోతే, జగన్‌పై గులకరాయి దాడి ఘటనపై స్పందిస్తూ, రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని, మనం జాగ్రత్తగా ఉండాలని, ఇకపై ఆయన మరింత జాగ్రత్తగా ఉంటారని భావిస్తున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments