పవన్ కళ్యాణ్ పోటీలో లేకుంటే పిఠాపురం అభ్యర్థిని నేనే : ఎస్వీఎస్ఎన్ వర్మ

సెల్వి
బుధవారం, 20 మార్చి 2024 (14:32 IST)
పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీలో లేకుంటే తానే అభ్యర్థిగా పోటీలోవుండేవాడినని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ లాంఛన ప్రాయమేనని అన్నారు. తాను గత రెండు దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతూ పార్టీ పురోగతితో పని చేస్తున్నట్టు చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పవన్ కోసం తన సీటును త్యాగం చేసినట్టు చెప్పారు. ఎంతో బాధతో ఈ స్థానాన్ని వదులుకున్నా. ఆయన విజయానికి కృషిచేస్తా. పవన్‌ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం నుంచి తానే బరిలో ఉంటానని చెప్పారు. 
 
మంగళగిరి పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ లోక్‌సభ, శాసనసభ స్థానాల్లో పోటీపై స్పందించారు. 'కేంద్ర పెద్దలు శాసనసభ, లోక్‌సభ స్థానాలు రెండింటిలోనూ పోటీ చేయాలన్నారు. శాసనసభకు పోటీ చేయడమే నాకు ఇష్టం. రాష్ట్రానికి ముందు పని చేసి ఆ తర్వాత దేశం కోసం ఆలోచిస్తా. ఒకవేళ లోక్‌సభకే పోటీ చేయాలని మోడీ, అమిత్‌షా అడిగితే అప్పుడు కాకినాడ స్థానం నుంచి పోటీ చేస్తా. ఆ పరిస్థితుల్లో ఉదయ్‌ శ్రీనివాస్‌ పిఠాపురం నియోజకవర్గానికి వస్తారు' అని పవన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో వర్మ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, పవన్ కళ్యాణ్ మాత్రం అసెంబ్లీ అభ్యర్థిగానే పోటీ చేస్తానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మణికంఠ తీసిన కొత్తపెళ్లికూతురు షార్ట్ ఫిలిం చాలా ఇష్టం : మెహర్ రమేష్

వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ల పోలీస్ కంప్లెయింట్

మహిళగా పుట్టినందుకు గర్వంగా ఉంది : జాన్వీ కపూర్

Sharva: సంక్రాంతికి శర్వా చిత్రం నారి నారి నడుమ మురారి గ్రాండ్ రిలీజ్

NTR, Balayya: ఒకప్పడు అబ్బాయి, ఇప్పుడు బాబాయ్ కి సినిమా రిలీజ్ కస్టాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments