జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యం.. మరో సందేహం వద్దు : ఆర్కే.రోజా

Webdunia
బుధవారం, 22 మే 2019 (12:14 IST)
నవ్యాంధ్ర రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆ పార్టీకి చెందిన సీనియర్ మహిళా నేత, నగరి వైకాపా అభ్యర్థి ఆర్కే. రోజా జోస్యం చెప్పారు. ఆమె బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 
 
ఆ తర్వాత ఆమె విలేకరులతో మాట్లడుతూ, మరి కొన్ని గంటల్లో వెల్లడికానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర ప్రజలు, వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు వల్ల రాష్ట్రం పరువు పోయిందని, అభివృద్ధిలో వెనుకబడిపోయామన్నారు. 
 
నగరి నియోజకవర్గం నుంచి తాను రెండోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని రోజా ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగడించిన లగడపాటి రాజగోపాల్‌ది స్వార్థపూరిత సర్వే అని, నిష్పక్షపాతంగా చేసింది కాదన్నారు. ఈ విషయం తమిళనాడు, తెలంగాణ ఎన్నికల ఫలితాలలో తేలిందన్నారు. 
 
లగడపాటి సర్వేను ప్రజల్లో ఒక్కరు కూడా నమ్మడం లేదన్నారు. త్వరలోనే వైఎస్‌ జగన్‌ సీఎం అవుతారని, మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెస్తారని ధీమా వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలను నమ్ముకున్న టీడీపీకి రేపటి ఫలితాలు సరైన గుణపాఠం చెబుతాయని చెప్పారు. ఐదేళ్లలో రాష్ట్ర మహిళలను అప్పులపాలు చేయడమే కాకుండా కోర్టు మెట్లు ఎక్కించారని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments