Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యం.. మరో సందేహం వద్దు : ఆర్కే.రోజా

Webdunia
బుధవారం, 22 మే 2019 (12:14 IST)
నవ్యాంధ్ర రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆ పార్టీకి చెందిన సీనియర్ మహిళా నేత, నగరి వైకాపా అభ్యర్థి ఆర్కే. రోజా జోస్యం చెప్పారు. ఆమె బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 
 
ఆ తర్వాత ఆమె విలేకరులతో మాట్లడుతూ, మరి కొన్ని గంటల్లో వెల్లడికానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర ప్రజలు, వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు వల్ల రాష్ట్రం పరువు పోయిందని, అభివృద్ధిలో వెనుకబడిపోయామన్నారు. 
 
నగరి నియోజకవర్గం నుంచి తాను రెండోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని రోజా ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగడించిన లగడపాటి రాజగోపాల్‌ది స్వార్థపూరిత సర్వే అని, నిష్పక్షపాతంగా చేసింది కాదన్నారు. ఈ విషయం తమిళనాడు, తెలంగాణ ఎన్నికల ఫలితాలలో తేలిందన్నారు. 
 
లగడపాటి సర్వేను ప్రజల్లో ఒక్కరు కూడా నమ్మడం లేదన్నారు. త్వరలోనే వైఎస్‌ జగన్‌ సీఎం అవుతారని, మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెస్తారని ధీమా వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలను నమ్ముకున్న టీడీపీకి రేపటి ఫలితాలు సరైన గుణపాఠం చెబుతాయని చెప్పారు. ఐదేళ్లలో రాష్ట్ర మహిళలను అప్పులపాలు చేయడమే కాకుండా కోర్టు మెట్లు ఎక్కించారని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments