అరకు వ్యాలీ కాఫీకి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు

ఠాగూర్
ఆదివారం, 28 సెప్టెంబరు 2025 (14:19 IST)
వైజాగ్ జిల్లా అరకు వ్యాలీ కాఫీకి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు, గౌరవం లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో ఉత్పత్తి అవుతున్న ఈ కాఫీకి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా భావించే 'బిజినెస్ లైన్' చేంజ్ మేకర్ అవార్డ్స్-2025 కార్యక్రమంలో 'ఫైనాన్షియల్ ట్రాన్స్‌ఫర్మేషన్' విభాగంలో 'చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్' పురస్కారాన్ని అరకు కాఫీ కైవసం చేసుకుంది. గిరిజనుల జీవితాల్లో ఆర్థిక మార్పునకు దోహదపడినందుకు గాను ఈ అవార్డును ప్రకటించారు.
 
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వైభవంగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేతుల మీదుగా జీసీసీ వైస్ చైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ కల్పన కుమారి ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అరకు కాఫీ కేవలం ఒక బ్రాండ్ మాత్రమే కాదని, అది గిరిజనుల ఆత్మగౌరవానికి, వారి శ్రమకు దక్కిన ప్రతీక అని పేర్కొన్నారు.
 
ఈ అద్భుతమైన విజయం వెనుక సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వం ఉందని కల్పనకుమారి తెలిపారు. ఆయన దార్శనికత, ప్రోత్సాహం వల్లే జీసీసీ ఈ స్థాయికి చేరుకోగలిగిందని ఆమె వివరించారు. ఈ అవార్డు తమ బాధ్యతను మరింత పెంచిందని, గిరిజన రైతుల అభ్యున్నతికి మరింతగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ గుర్తింపు పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హర్షం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments