Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిని ఎందుకు వేధించారని ప్రశ్నించాడు.. వైకాపా యువనేతను కత్తితో పొడిచేశారు..

వైఎస్సార్ కాంగ్రెస్ యువనేత సత్తార్‌బేగ్ (35) దారుణహత్యకు గురయ్యారు. చిత్తూరు జిల్లా పెద్ద మండ్యంలో మంగళవారం రాత్రి సత్తార్ బేగ్ దారుణంగా హతుడైనాడు. పెద్దమండ్యం పాతవూరు జెండామాను వీధికి చెందిన కాలవగడ్డ

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2017 (09:06 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ యువనేత సత్తార్‌బేగ్ (35) దారుణహత్యకు గురయ్యారు. చిత్తూరు జిల్లా పెద్ద మండ్యంలో మంగళవారం రాత్రి సత్తార్ బేగ్ దారుణంగా హతుడైనాడు. పెద్దమండ్యం పాతవూరు జెండామాను వీధికి చెందిన కాలవగడ్డ హుసేన్‌బేగ్ కుమారుడు సత్తార్‌బేగ్ (35) కార్పెంటర్‌గా పనిచేస్తూనే మండల వైసీపీ యూత్ లీడర్‌గా పనిచేస్తున్నాడు. అతని బావమరిది ఇమ్రాన్ అదే ఊరిలో ఓ దుకాణం నడుపుతున్నాడు. 
 
ఇమ్రాన్ దగ్గరి బంధువు కుమార్తె కాలేజీకి వెళ్లే సమయంలో.. అదే గ్రామానికి చెందిన హర్షవర్ధన్, అతడి తమ్ముడి విష్ణు, మరో యువకుడు కోతిమణి కలిసి వేధించారు. వారిని ఇమ్రాన్ బెదిరించాడు. దీంతో కక్ష పెంచుకున్న యువకులు మంగళవారం మద్యం తాగి ఇమ్రాన్‌పై రాళ్లతో దాడిచేసి గాయపరిచారు. దీంతో ఇమ్రాన్ తన బావమరిది సత్తార్‌ను తీసుకుని యువకులను ప్రశ్నించేందుకు వెళ్లాడు. 
 
ఎందుకిలా చేశారంటూ సత్తార్ వారిని ప్రశ్నిస్తుండగానే అతని చాతిపై కత్తితో పొడిచేశారు. దీంతో అక్కడే కూలిపోయిన సత్తార్‌ను ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే సత్తార్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments