Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాలో చేరి తప్పు చేశా.. సునీత కాళ్లపై పడిన కార్యకర్త

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (09:09 IST)
అమ్మా.. నన్ను క్షమించు.. వైకాపాలో చేరి తప్పు చేశాను అంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత కాళ్లపై ఓ కార్యకర్త పడి ప్రాధేయపడ్డారు. టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం విస్తృతంగా సాగుతోంది. ఇందులోభాగంగా, సోమవారం అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామంలో పరిటాల సునీత ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం జరిగింది.
 
ఈ సందర్భంగా మచ్చుమర్రి గ్రామానికి చెందిన రామాంజనేయులు మాజీ మంత్రి సునీత కాళ్లపై పడ్డారు. అమ్మా.. వైకాపాలో చేరి తప్పు చేశాను. నన్ను క్షమించు అమ్మా అంటూ వేడుకున్నారు. 
 
వైకాపాలో చేరి తప్పు చేశానని, తనను మళ్లీ టీడీపీలో చేర్చుకోవాలంటూ ప్రాధేయపడ్డారు. దీంతో రామాంజనేయులను ఆమె పైకిలేపి... మీలాంటి వారికి పార్టీలో ఎప్పటికీ స్థానం ఉంటుందని భరోసా ఇస్తూ, అక్కడే టీడీపీ కండువా కప్పి.. టీడీపీ సభ్యత్వం కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments