వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐకి లేఖ రాసిన RRR

Webdunia
శనివారం, 26 మార్చి 2022 (17:48 IST)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చీఫ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు శనివారం లేఖ రాశారు.
 
2019 అసెంబ్లీ ఎన్నికలకు 2 నెలల ముందుగా మార్చిలో వైఎస్‌ వివేకానందరడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. 
 
వైఎస్ వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో వైఎస్ కుటుంబ సభ్యులపైనే తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్థిక లావాదేవీల్లో భాగంగా జరిగిన ఈ హత్యలో రూ.40 కోట్ల మేరకు సుపారీ చేతులు మారినట్లు, పథకం ప్రకారం అంతమొందించినట్లు నిందితులు చెప్పడం తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలో సీబీఐ చీఫ్‌కు ఎంపీ రఘురామ లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
 
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును వేగవంతం చేయాలని ఎంపీ రఘురామ ఆ లేఖలో కోరారు. ఈ కేసులో ఆలస్యం జరిగితే నిందితులు ఎంతకైనా తెగించే ప్రమాదం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, దివంగత పరిటాల రవీంద్ర హత్య కేసులో మాదిరిగానే నిందితులను హత్య చేసే కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

తర్వాతి కథనం
Show comments