Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్మార్గుల జాబితాలో జగన్ చేరి గుర్తుండిపోతారేమో : వైకాపా రెబెల్ ఎంపీ

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (16:36 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కొందరు దుర్మార్గుల జాబితాలో చేరి చరిత్రలో గుర్తుండిపోతారేమో అని ఆ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం రైతులు భూములిచ్చారని గుర్తుచేశారు. 
 
కానీ, ఏపీ ప్రభుత్వం మాత్రం ఒక్కో ఆఫీసును ఒక్కో ప్రాంతానికి తరలిస్తూ వస్తుందన్నారు. దానికి వ్యతిరేకంగా మాట్లాడితే బూతులు తిడతారా అని ప్రశ్నించారు. పైగా, జగన్ దుర్మార్గుల జాబితాలో చేరారని ఆరోపించారు. అయితే, తాను మాత్రం వైకాపా ప్రభుత్వం, వైకాపా నేతల  దాష్టీకాల మీద పోరాటం చేస్తానని తెలిపారు 
 
ఇకపోతే, ఏపీలో ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థ దౌర్జన్యపూరితంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లకు జీతమిస్తున్నామని చెప్పి ఉద్యోగులకు జీతం ఇవ్వడం లేదని గుర్తుచేశారు. అలాగే, పాఠశాలల్లో ఆంగ్ల మీడియం గురించి మాట్లాడినప్పటి నుంచే తనపై కక్ష సాధింపు చర్యలకు శ్రీకారం చుట్టారని ఆయన ఆరోపించారు. తనపై అనర్హత వేటు వేయించేందుకు ముఖ్యమంత్రి జగన్, కొందరు దుర్మార్గులతో చేరి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments